నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యాహ్నం బైక్పై నిజామాబాద్కు వెళ్తుండగా కంకర లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉమాకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఐదవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్కును సీజ్ చేశారు.