Vikram-1 | హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ‘స్కైరూట్’ తయారు చేసిన ‘విక్రమ్-1 (Vikram)’ రాకెట్ ప్రయోగం రేపు (శనివారం) ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్ దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్గా రికార్డు సృష్టించనుంది. ఈ రాకెట్ 23 మీటర్ల ఎత్తు, 1.7 మీటర్ల వెడల్పు ఉండి 350 కిలో పేలోడ్లను మోసుకెళ్లుంది. ఇది మూడు దశల సాలిడ్ కాన్ఫిగరేషన్తో పాటు ద్రవ ఇంధనంతో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ (వోఏఎమ్)ను ఉపయోగిస్తుంది.
‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో స్కైరూట్ (Skyroot)కు చెందిన స్కోప్ ఉపగ్రహం, బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ప్రయోగశాలలో తయారు చేసిన తామర పువ్వు ఆకారంలోని వజ్రం (Diamong) అంతరిక్షంలోకి పంపనున్నట్లు స్కైరూట్ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. అలాగే విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం, సీవీ రామన్లకు నివాళిగా వారి సూక్ష్మ శిల్పాలతో పాటు ప్రధాని మోదీ ప్రత్యేకంగా రాసిన సందేశాన్ని కూడా అంతరిక్షంలోకి పంపుతున్నామని చెప్పారు.