pisachi-2 | విభిన్న కథలను తెరకెక్కించడంలో తమిళ డైరెక్టర్ మిష్కిన్ ముందు వరుసలో ఉంటాడు. ‘పిశాచి’, ‘డిటెక్టీవ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పిశాచి-2’. 2004లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘పిశాచి’ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండేళ్ళ క్రితమే మిష్కిన్ అనౌన్స్ చేశాడు. కరోనా కారణంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఆండ్రీయా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించాడు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి జాన్ అనే పాత్రలో నటించాడు. ఇక విజయ్ తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సీక్వెల్పై ప్రేక్షకులలో మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. ఇక విజయ్ సేతుపతి ఈ చిత్రంలో భాగం అవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని రాక్ఫోర్ట్ ఎంటర్టైనమెంట్ పతాకంపై టి.మురుగనాంతమ్ నిర్మించాడు. తెలుగులో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల కానుంది.
Our #John @VijaySethuOffl completed his Dubbing for @DirectorMysskin's magnum opus #Pisasu2 #Pisachi2 #Pishaachi2 #Pishaachi2@andrea_jeremiah @Lv_Sri @actor_ajmal @shamna_kkasim @Actorsanthosh @kbsriram16 @APVMaran @saregamasouth @teamaimpr pic.twitter.com/H5DwFIHfRd
— RockFort Entertainment (@Rockfortent) May 25, 2022