సూర్యాపేట : నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాలులో విజయగర్జన సభ నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యతన జరిగింది.
సమావేశానికి మంత్రి జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేంధర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్లో నిర్వహించే సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాల్లో మనమంతా పాల్గొని.. అద్వితీయంగా జరుపుకోవాలన్నారు.
సమావేశానికి ముందు మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాలు నుంచి శుభమస్తు ఫంక్షన్ హాలు వరకు రెండువేల బైక్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ శాఖ, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.