విజయ్దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ ఉపశీర్షిక. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనన్యపాండే కథానాయిక. సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. విజయ్దేవరకొండ, మైక్టైసన్ మధ్య వచ్చే సన్నివేశాలు థ్రిల్ను పంచుతాయి.
త్వరలో చివరి షెడ్యూల్ను ప్రారంభిస్తాం. నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఈ నెల 29న బిగ్ అనౌన్స్మెంట్ వీడియోను అభిమానులతో పంచుకోబోతున్నాం. డిసెంబర్ 30న స్పెషల్ స్టిల్స్, 31న ఫస్ట్ గ్లింప్స్ను విడుదలచేస్తాం. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. రమ్యకృష్ణ, రోనిత్రాయ్, విష్ణురెడ్డి, మకరంద్దేశ్పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.