విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’చిత్రం ఆరంభం నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ ఈ సినిమాలో భాగం కావడం ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నది. ఇటీవలే అమెరికా షెడ్యూల్ పూర్తయింది. విజయ్ దేవరకొండ, మైక్టైసన్, కథానాయిక అనన్య పాండేలపై కీలక ఘట్టాలను తెరకెక్కించారు.
మిగిలిన ఓ చిన్న షెడ్యూల్ను ఇండియాలో జరుపబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ను ఈ నెల 31న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘దిస్ న్యూ ఇయర్ ఆగ్ లగాదేంగే’ (కొత్త ఏడాది అగ్గిరేపుతాం) అంటూ సినిమా గురించి వ్యాఖ్యానించారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పూరీ కనెక్ట్స్తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రమ్యకృష్ణ, రోనిత్రాయ్, విష్ణురెడ్డి, అలీ, మకరంద్దేశ్ పాండే, గెటప్శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్జోహార్, అపూర్వమోహతా, దర్శకత్వం: పూరి జగన్నాథ్.