న్యూఢిల్లీ: భారత నావికాదళానికి తదుపరి చీఫ్గా వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టు రక్షణశాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఈ నెల 30న రిటైర్ కానున్నారు. వైస్ అడ్మిరల్ హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు.