హైదరాబాద్ : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలో బుధవారం ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామానికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బానయ్య, మారయ్యగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.