మహబూబ్నగర్ :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల సౌకర్యార్థం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
ఇందులో భాగంగా ఆదివారం కలెక్టర్ భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో భూత్పూర్ మున్సిపాలిటీ కి సంబంధించిన వెజ్, నాన్ వేజ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అమిస్తాపూర్ సమీపంలో ఎంపిక చేసిన ఈ స్థలం మ్యాప్ తో సహా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.