ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్ తనకు కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నేపథ్యంలో ఆమెకు కరోనా సోకింది. నివేదా థామస్కు కరోనా అని నిర్ధారణ అయిన నాలుగు రోజులలో మరో హీరోయిన్ అంజలికు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది.
నివేధా థామస్తో ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న అంజలి కరోనా బారిన పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ టీం భయబ్రాంతులకు గురవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయానికి వెళ్తే తాను టెస్ట్ చేయించుకుంది కానీ ఎలాంటి పాజిటివ్ రిపోర్ట్ రాలేదట. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం అవాస్తవం అని అంజలి టీం చెబుతున్నారు.ఇక వకీల్ సాబ్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో ప్రతి పాత్ర వైవిధ్యంగా సాగుతుంది .