తొలి చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవే తేజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’తో అందరి ప్రశంసలు పొంది.. క్రేజీ హీరోగా మారాడు. దీంతో పెద్ద పెద్ద బ్యానర్లు సైతం వైష్ణవ్తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్.. శుక్రవారం కొత్త చిత్రం షూటింగ్ను పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘అర్జున్రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసిన డైరెక్టర్ గిరీశయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
‘రొమాంటిక్’, లక్ష్య’ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాలో వైష్ణవ్తో జతకట్టనుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యాన్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయితేజ్ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టగా.. విజయ దుర్గా కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ ఓ సినిమాకి కమిట్ అయినట్లు సమాచారం.