తిరుమల : తిరుమల ( Tirumala ) లో వైకుంఠ ద్వార దర్శనం ( Vaikuntha Dwara Darshan ) కోసం స్థానికులకు ఈ నెల 25 నుంచి 27 వ తేదీ వరకు ఈ డిప్ నమోదుకు టీటీడీ(TTD) అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల స్థానికుల కోటా కింద జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల చొప్పున దర్శన టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది.
స్థానికులకు 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున జారీ చేస్తామని వివరించారు. స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీవరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.