లండన్: ఐపీఎల్లో పవర్ఫుల్ బ్యాటింగ్తో దంచికొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ టూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభించనుంది. ఇంగ్లండ్తో వచ్చే నెలలో జరిగే ఐదు టీ20ల సిరీస్కు సెలెక్ట్ అయిన వైభవ్ తోడుగా అతడి తల్లిదండ్రులను బీసీసీఐ వెంట పంపిస్తుండగా.. అన్ని వేదికల్లోనూ ఆ కుర్రాడికి ప్రత్యేక చేంజింగ్ రూమ్ కేటాయించనున్నారు.
ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 ఏండ్ల లోపు ఆటగాళ్లను పెద్దల చేంజింగ్ రూమ్స్లోకి అనుమతించని కారణంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ సమయంలో అతడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటూనే టీమ్ మీటింగ్స్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, దుస్తులు మార్చుకునేటప్పుడు మాత్రం ప్రత్యేక రూమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది.