హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తం చేశారు ఈ ప్రాంతానికి చెందిన మున్నూరు కాపులు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన రాజ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు అభినందనలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో మున్నూరు కాపులు తరలివచ్చారు. ఎంపీకి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువ కప్పి అభినందించారు. రవిచంద్ర అందరికీ స్వీట్స్ పంచి పెట్టి, పార్టీ విజయానికి పాటుపడిన అందరిని పేరుపేరునా అభినందించారు. మున్నూరుకాపులంతా ఇలానే ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునుగోడు ఎన్నికలో రవిచంద్ర నాయకత్వంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తం టీఆర్ఎస్ అభ్యర్థి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం విశేషంగా పాటుపడ్డారు.
ఎంపీ వద్దిరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సర్థార్ పుట్టం పురుషోత్తం, ఆకుల రజిత్,బండి సంజీవ్, విష్ణు జగతి,వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, జెన్నాయికోడే జగన్మోహన్, పుస్తే శ్రీకాంత్, కోట్ల వినోద్, బాశెట్టి నర్సింహారావు, పాదం అనిల్ కుమార్, కంచర్ల భిక్షమయ్య, కసిరెడ్డి శ్రీనివాస్, మెరుగు మురళి, న్యాయవాదులు గుండ్లపల్లి శేషగిరిరావు, సకినాల రవికుమార్, యువ నాయకులు యాద క్రాంతి, అనిల్ పటేల్, నిరంజన్ తదితరులు ఉన్నారు.