హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, ఎంతమంది మొదటి, రెండో డోస్ తీసుకున్నారో వివరాలు పకాగా సేకరించాలని చెప్పారు. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు కలిసి గ్రామం, సబ్ సెంటర్, పీహెచ్సీ స్థాయిల్లో ప్రతి ఒక్కరు రెండు డోసులు వేసుకొనేలా చూడాలని స్పష్టంచేశారు. గురువారం ఉత్తర తెలంగాణలోని 18 జిల్లాలకు చెందిన 19,560 వైద్యసిబ్బందితో కొవిడ్ వ్యాక్సినేషన్పై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 5.55 కోట్ల డోసులు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 3.60 కోట్ల డోసులు వేశామని చెప్పారు. తొలి కోటి డోసులకు 165 రోజులు పట్టగా, రెండో కోటి డోసులకు 78 రోజులు, 3వ కోటి డోసులకు 27 రోజులు పట్టిందన్నారు. ప్రజల్లో కొవిడ్ టీకాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, మారెట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలపై ప్రత్యేకదృష్టి సారించి వాక్సినేషన్ చేపట్టాలని చెప్పారు. వాక్సినేషన్ 80 శాతం కన్నా తకువ ఉన్న జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచండి
మాతాశిశు సంరక్షణపై ఆశావరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, రక్తహీనతపై అవగాహన కల్పించి, వారికి అవసరమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగేలా, సాధారణ ప్రసవాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పిల్లలకు అవసరమైన సాధారణ టీకాలు 96 శాతం వేశారని, దీన్ని వంద శాతానికి చేర్చాలని అన్నారు. పీహెచ్సీల్లో పాము, తేలు, కుకు కాటుకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రజలకు మంచి వైద్యసేవలు అందించి రాష్ర్టాన్ని ప్రజారోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీపీహెచ్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.