మానకొండూర్ రూరల్, జనవరి 6: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబాని ఆధ్వర్యంలో గురువారం 55 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, పచ్చునూర్, కేల్లేడు గ్రామాల్లో పెద్దలు 43 మంది, 15 నుంచి 18 ఏండ్ల పిల్లలు 90 మంది, పోచంపల్లి మోడల్ స్కూల్లోని 307 మంది విద్యార్థులకు మొత్తం 440 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అర్చనాప్రియదర్శిని, ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది ఉన్నారు.
లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కొండపల్కల జడ్పీ ఉన్నత పాఠశాల, గంగిపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతీ విద్యాలయాల్లోని 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపల్కలలో 65 మంది, గంగిపల్లిలో 59 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, నందగిరి రమేశ్కుమార్, కరస్పాండెంట్ రంగు శ్రీనివాస్, సీహెచ్వో రాజు నాయక్, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఏఎన్ఎంలు సంజీవ, అన్నపూర్ణ, ఆశ వర్కర్లు సుజాత, సరోజన, లావణ్య, స్వాతి, సిబ్బంది ఉన్నారు.
పాఠశాలల్లో ..
శంకరపట్నం, జనవరి 6: మండలంలోని మొలంగూర్, తాడికల్, కన్నాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో గురువారం వైద్య ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు కొవాగ్జిన్ టీకాలు వేసినట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షాకీర్అహ్మద్ వెల్లడించారు. వారం రోజుల పాటు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ లో ప్రతి విద్యార్థికీ టీకా వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైద్యాధికారి తెలిపారు. శుక్రవారం కేశవపట్నం, కొత్తగట్టు, మెట్పల్లి పాఠశాలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు టీకాలు
సైదాపూర్, జనవరి 6: ఎక్లాస్పూర్ గ్రామంలో 15 నుంచి 18 సంవత్సరాల వారికి వైద్యసిబ్బంది వ్యాక్సిన్ వేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు టీకాలు వేశారు. సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది ఉన్నారు.