హరిద్వార్: ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ తన రిసార్ట్లో పనిచేస్తున్న అంకిత భండారి అనే అమ్మాయిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టేందుకు సిట్ను ఏర్పాటు చేసినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అంకితను హత్య చేసి.. కెనాల్లో పడేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఐజీ పీ రేణుకా దేవి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ కేసు విచారణను సిట్ పూర్తిగా చూసుకుంటుందన్నారు. నిందితుల్ని వదిలేది లేదన్నారు.
హరిద్వార్ జిల్లాయంకేశ్వర్లో పుల్కిత్ నడుపుతున్న రిసార్టులో అంకిత పనిచేస్తున్నది. గత సోమవారం ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు ఆ రిసార్ట్ ఓనర్. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయటంతో హత్య చేశానని ఒప్పుకొన్నాడు. అతడిని, సహకరించిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వినోద్ ఆర్య గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మంత్రి హోదా ర్యాంకు అనుభవిస్తున్నారు.
ఇవాళ ఉదయం అధికారులు రిషికేశ్లో ఉన్న వనతార రిసార్ట్ను కూల్చివేశారు. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యా దీని ఓనర్.