హాంకాంగ్: ఉక్రెయిన్పై దాడుల సమయంలో రష్యాపై సైబర్ దాడి జరిగింది. రక్షణ, హోంమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ వార్త సంస్థకు చెందిన వెబ్సైట్లను హ్యాకింగ్ చేశారు. అయితే ఈ సైబర్ దాడులను అమెరికానే చేసినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, భారత్, చైనా, జపాన్తో పాటు పలుదేశాలకు చెందిన రిసెర్చ్ సంస్థల వెబ్సైట్లను కూడా అమెరికా సంస్థ హ్యాంకింగ్ చేసిందని చైనాలోని బీజింగ్కి చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ)తో హ్యాకర్లకు సంబంధం ఉందని తాజాగా తన నివేదికలో పేర్కొన్నది. బీజింగ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్న హ్యాకింగ్కి గురైన రిసెర్చ్ సంస్థల జాబితాలో భారత్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ(ఐఎంటెక్), ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్-బెంగళూరు, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉన్నాయి.
కీవ్: కీవ్ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో వారు మారువేషాల్లో రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు. కొంతమంది రష్యా సైనికులు ఉక్రెయిన్ జవాన్ల యూనిఫాం ధరించి, ఉక్రెయిన్ మిలటరీ వాహనాలను స్వాధీనం చేసుకొని కీవ్ వైపు వెళ్తున్నారని మీడియా పేర్కొంది.