లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా ఇవాళ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరి ఫోన్ మోగినా ఆ ఫోన్ను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. సభ జరుగుతున్న సమయంలో ఫోన్లను స్విచాఫ్ చేయాలని ఆయన సూచన చేశారు. ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ఫోన్ మోగింది. ఈ ఘటన పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు అని, ఇక నుంచి ఎవరి ఫోన్ మోగినా, దాన్ని సీజ్ చేస్తామని స్పీకర్ తన వార్నింగ్లో తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో కచ్చితం సభ్యులందరూ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయాలని సూచన చేశారు.