న్యూఢిల్లీ : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ని ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నాడు. ఈ నెల 10న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కమెడియన్ శ్రీవాస్తవను ఉంచిన గదిలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఐటీయూలో కమెడియన్తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ఐసీయూలోకి వ్యక్తి ప్రవేశించడం కలకలం రేగింది. భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది పట్టుకొని ప్రశ్నించారు. ఆ తర్వాత ఐసీయూ వద్ద గార్డ్లను మోహరించారు. ఇదిలా ఉండగా.. రాజు ఆరోగ్యం రోజు రోజుకు కొంత మెరుగవుతోందని కుటుంబీకులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజు త్వరగా కోలుకోవాలని కుటుంబీకులు కొద్ది రోజులుగా ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ వస్తున్నారు.