రవీంద్రభారతి : శృతిలయ ఆర్ట్స్- సీల్వెల్ కార్పొరేషన్ కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయులకు ప్లవనామ ఉగాది ఉత్తమ పురస్కారాలు అందజేశారు. ఉత్తమ పాత్రికేయుడిగా ‘ నమస్తే తెలంగాణ’ సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్ దొర్బల బాలశేఖర శర్మకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. సమాజ చైతన్యానికి పాత్రికేయుల పాత్ర కీలకమని, ఈ పురస్కారాలు ఉత్తమ పాత్రికేయ పురస్కారాలను అందజేస్తున్న శృతిలయ ఆర్ట్స్- సీల్వెల్ కార్పొరేషన్ కోవిద సహృదయ ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గౌరవ అతిథి సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు, సమాజ సేవకురాలు డాక్టర్ జి. అనూహ్యరెడ్డి, శృతిలయ చైర్మన్ డాక్టర్ బొక్క భీంరెడ్డి, శృతిలయ వ్యవస్థాపకురాలు ఆమని, వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులు వార్త అసోసియేట్ ఎడిటర్ ఏవీవీ ప్రసాద్, సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు, నమస్తే తెలంగాణ సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్ దొర్బల బాల శేఖరశర్మ, ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ న్యూస్ ఫొటోగ్రాఫర్ రావూరి వెంకట కోటేశ్వరరావు, తెలంగాణ టు డే డిప్యూటీ ఎడిటర్ దశగ్రంధి మాధురి, ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ గుజ్జల రమేశ్, హన్స్ ఇండియా అసిస్టెంట్ ఫీచర్స్ ఎడిటర్ అక్కరి జాఫర్, ఈనాడు సీనియర్ జర్నలిస్టు ఏవీ నర్సింగ్రావు ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి డాక్టర్ మహ్మద్ రఫీ, కూచిపూడి నాట్య గురు కళారత్న డాక్టర్ ఎస్పీ భారతి పాల్గొన్నారు. గాయని ఆమని పాడిన పాటలు అలరించాయి.