హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు బృందం విచారిస్తున్నది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధా కిషన్ రావు(Former DCC Radha Kishan Rao)తో పాటు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లుని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.