పాటియాలా: పంజాబ్లోని పాటియాలాలో ఇవాళ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన సమయంలో ఈ ఘర్షణ తలెత్తింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని, గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. శాంతి, సామరస్యంతో ఉండాలని పోలీసులు వేడుకున్నారు. శివసేన గ్రూపు.. ఖలిస్తాన్ అనుకూల సిక్కు వర్గీయులు నిరసన ప్రదర్శనలో ఎదురుపడిన సమయంలో ఘర్షణ జరిగింది. ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ శివసేన వర్గం నినాదాలు చేయగా.. రెండు వర్గాల జనం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు కూడా తిప్పారు. శాంతి స్థాపన కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు పాటియాలా జిల్లా కమీషనర్ సాక్షీ సాన్వే తెలిపారు.