టోక్యో : మోడెర్నా వ్యాక్సిన్ (Moderna Vaccine) వికటించి జపాన్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ సంఘటన అనంతరం మోడెర్నా వ్యాక్సిన్ను సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 863 వ్యాక్సినేషన్ కేంద్రాలకు 16.3 లక్షల వ్యాక్సిన్లు సరఫరా చేశారు. వీటిని వాడకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పలు వయల్స్ కలుషితంగా ఉన్నాయని దేశీయ పంపిణీదారు టకెడా ఫార్మాస్యూటికల్కు నివేదిక అందిన వారం రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న 30 ఏండ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారని శనివారం జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరి మరణంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. రక్షణ గానీ, సమర్ధత సమస్యలుగానీ గుర్తించబడలేదని, మోడెర్నా వ్యాక్సిన్పై సస్పెన్షన్ చర్యలు కేవలం ముందు జాగ్రత్తగానే తీసుకున్నట్లు మోడెర్నా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వ్యాక్సిన్ వయల్స్లో లోహ కణాలను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపిందని జపనీస్ పబ్లిక్ బ్రాడకాస్టర్ ఎన్హెచ్కే తెలిపింది.
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..