హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని, వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. సముద్రమట్టానికి 1.9 నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉందని చెప్పింది. ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపుకు తిరిగి ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. కొన్ని గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశమున్నట్లు చెప్పింది. దీంతో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నెల 20, 21న ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.