హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 22 వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఉపరితల ద్రోణి, గాలి విచ్ఛిన్నతి బలహీపడ్డాయి. శుక్రవారం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షం కురిసింది. ఈ ఏడాది సీజన్లో నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో 35 నుంచి 55 శాతం అదనంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు.