తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో జులై 21న తులసి మహత్య ఉత్సవం జరుగనున్నది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని కోవిడ్ నిబంధనల మేరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ఆస్థానం జరుగనున్నది. ఈ సందర్భంగా అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తులసి ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ వాహనసేవను టిటిడి రద్దు చేసింది.