తిరుమల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. నష్టాల్లో నడుస్తున్న టీఎస్సార్టీసీని లాభాల బాట పట్టేలా చేయాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. కరోనా వల్ల తక్కువ సర్వీసులు నడుపుతున్నామని, త్వరలో తిరుపతికి సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం డిసెంబర్ టోకెన్లను టీటీడీ విడుదల చేయనున్నది. 27న ఉదయం 9 గంటలకు ఈ టోకెన్లను విడుదల చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది.