హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో ఓ నిందితుడికి చెందిన రూ.2,89,39,681 విలువైన ఆస్తులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రభుత్వపరం చేసింది. ఈ నెల 22న ప్రిన్సిపల్ జడ్జి సాంబశివరావునాయుడు ఈ మేరకు తీర్పునిచ్చారు. అబిడ్స్లోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయ మాజీ సూపరింటెండెంట్ కే వెంకటేశ్వర్రావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్టు రుజువుకావడంతో 2002లో కేసు నమోదైంది. విచారణ జరుగుతుండగానే నిందితుడు వెంకటేశ్వరరావు మృతిచెందడంతో అతడి పేరిట భార్య శ్యామల, కుమారులు మాధవ్, కేవీ శేషగిరి ఆధీనంలో ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.