శాంటియాగో: చిలీ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. లిక్విడ్ గ్యాస్తో వెళ్తున్న ట్రక్కు(Truck Explosion) ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని శాంటియాగో హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. హైవేపై వెళ్తున్న వాహనం తొలుత బోల్తా కొట్టింది, ఆ తర్వాత అది పేలినట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు అదుపు తప్పి ప్రమాదానికి లోనైంది. దుర్ఘటనలో ట్రక్కు డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు.
ట్రక్కు బోల్తా పడిన తర్వాత ఆ వాహనం నుంచి లిక్విడ్ గ్యాస్ వ్యాపించింది. ఆ రూట్లో వెళ్తున్న వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. పొగ విస్తరిస్తున్న విజువల్ సీసీ కెమెరాలకు చిక్కాయి. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో మంటలు అంటుకున్నాయి. స్థానిక గాస్కో గ్యాస్ కంపెనీ ట్రక్కు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. లిక్విడ్ గ్యాస్ పేలడం వల్ల సుమారు 200 మీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. 50 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం పట్ల దేశాధ్యక్షుడు గాబ్రియల్ బోరిస్ విచారం వ్యక్తం చేశారు.
Tragična nesreča v Čilu 🇨🇱, eksplozija vlačilca cisterne z utekočinjenim plinom.https://t.co/gUc7whnesw pic.twitter.com/mSb1pX9TvV
— Schall_abweiser0002 (@Schallabweiser2) February 20, 2026