హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. వరదల కారణంగా జనం ఇబ్బందులు పడుతుండగా.. వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అండగా నిలిచింది. చిత్తూరు, అనంతపురం బుధవారం దాదాపు 900 కుటుంబాలకు అభిస్తి వెల్ఫేర్ సొసైటీ సహాయంతో పాలు, బ్రెడ్, బిస్కట్స్, పాలపొడి, ఎనర్జీ బార్ అందించారు. రెండు రోజుల పాటు సహాయక కార్యక్రమాలు చేపడుతామని టీఆర్ఎస్ సౌత్ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు.