హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను అందించారు. దీవకొండ దామోదర్రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఒకసెట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి మరో సెట్ను దాఖలు చేశారు.
అలాగే బండి పార్థసారథిరెడ్డి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ఒక సెట్ను, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మరో సెట్ను దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు మన్నే శ్రీనివాస్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వర్రావు, వనమా వెంకటేశ్వర్రావు, లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, రాములు నాయక్, సంజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి నామినేషన్ దాఖలు అనంతరం అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు.