హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరి ముగిసింది. మాదాపూర్ హైటెక్స్లో ఉదయం నుంచి ఎనిమిది గంటల పాటు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తొలి తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయాలు, సంక్షేమ తెలంగాణ సాకారం, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్, పరిశ్రమలు.. దేశానికి దిక్సూచిగా దళితబంధు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్రానికి పలు డిమాండ్లతో తీర్మానాలు ప్రవేశపెట్టి.. ఆమోదించారు.