దేశంలో కేసీఆర్ దిశా నిర్దేశానికి మునుగోడు ఫలితం నాంది పలికిందన్నారు టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల. మునుగోడు విజయం సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనని అభివర్ణించారాయన. టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని, ఈ ఎన్నికతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని మరోసారి స్పష్టమైందన్నారు నాగరాజు. విజేతగా నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారాయన. బీఆర్ఎస్ జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాంది కానుందని పేర్కొన్నారు నాగరాజు.