అచ్చంపేట, జనవరి 30: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి సత్కరించారు. శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన భార్య అమల ఆధ్వర్యంలో కలిసిన మొగులయ్యతో చిన జీయర్ స్వామి ముచ్చటించారు. కిన్నెర కళ నేపథ్యం, కుటుంబ పరిస్థితి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కిన్నెర కళ అంతరించిపోకుండా పది మందికి ఉపయోగపడేలా నేర్పించాలని ఆకాంక్షించారు. అనంతరం విప్ గువ్వల మాట్లాడుతూ, కిన్నెర కళ అంతరించిపోకుండా కొంత స్థలంలో అకాడమీ ఏర్పా టు చేసి ఆసక్తి ఉన్నవారికి నేర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.