హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దీంతో అధికారులు విజయవాడ నుంచి ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించినట్టు సమాచారం. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఆయన ఊపిరితిత్తుల సం బంధ సమస్యతో బాధపడుతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నెల 16న గవర్నర్కు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగా హైదరాబాద్లోని ఏఐజీలో చికిత్స అందించారు.