అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిలో సునీతా త్రిపాఠి అనే యువతి మృతదేహం లభ్యం కాగా మరో యువకుడి మృతదేహం కొట్టుకు వచ్చింది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీకెండ్ కావడంతో విశాఖ పరిసరాల ప్రజలతో పాటు సమీపంలోని ఒడిశా ప్రాంత ప్రజలు ఆదివారం ఈ బీచ్ను తిలకించేందుకు వస్తుంటారు.
దీంట్లో భాగంగా హైదరాబాద్, ఒడిశా నుంచి వచ్చిన 13 మంది ఈత కోసం దిగారు. వీరిలో 8 మంది బీచ్లో దిగగా ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు రాగా అలల ఉద్దృతిలో 5 గురు కొట్టుకుపోయారు. వీరిలోని ఒకరిని స్థానికులు కాపాడగా నలుగురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు రెండు మృత దేహాలు లభ్యం కాగా మరో ఇద్దరు ఆచూకి తెలియవలసి ఉంది . సమాచారం అందుకున్న గస్తీ తీర సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.