ముంబై : ముంబైలో ఇటీవల ప్రధాని మోదీ అటల్ సేతు(Atal Setu) బ్రిడ్జ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబైలోని సెవ్రి నుంచి రాయ్గడ్ జిల్లాలోని నవ సేవా వరకు ఆ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. శనివారమే ఆ బ్రిడ్జ్ను పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇక ఆ బ్రిడ్జ్పై వాహనదారులు రూల్స్ ఉల్లంఘించి ప్రవేశిస్తున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశారు. 21.8 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ బ్రిడ్జ్పై ఓ ఆటో కనిపించింది. నిజానికి మూడు చక్రాల ఆటోలకు అనుమతి లేదు. కానీ ఆ బ్రిడ్జ్పై ఆటో తిరుగుతున్నట్లు శరవణన్ రాధాకృష్ణణ్ అనే వ్యక్తి తన ఎక్స్లో ఫోటో పోస్టు చేశారు. అనేక మంది నెటిజెన్లు ఆ ఆటోను చూసి స్టన్ అయ్యారు. ఆ ఆటో డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కొందరు సూచించారు. చిర్లే, ఉల్వేలో టోల్ బూత్ ఉంటుందని, ఇక ముంబై దిక్కు అయితే సోబో వద్ద టోల్ ఉంటుందని, అక్కడ నుంచి ఆటోలకు అనుమతి ఉండదని, మరి ఇదెలా వచ్చిందని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. ఆ ఆటోవాలా కనీసం ఓ ఫోటో కోసం కూడా ఆగలేదని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. కొత్త బ్రిడ్జ్ను ఆటో సేతు అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఆటో వెనుక ఎఫ్ఐఆర్ మిలేంగే అని రాసి అతను వార్నింగ్ ఇచ్చినట్లు మరో యూజర్ తెలిపాడు. ఆ ఆటోవాలాకు చెలాన్ ఇవ్వాలని కొందరు కోరారు.
Atal setu pic.twitter.com/YOVp08VmLm
— Saravanan Radhakrishnan ☮️ (@saravnan_rd) January 15, 2024