న్యూఢిల్లీ, అక్టోబర్ 26: డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణకు విమానయాన శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం వెయ్యి అడుగులలోపు ఎగిరే డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణను థర్డ్ పార్టీ ప్రొవైడర్లు చేపట్టవచ్చు. ఇప్పటికే డ్రోన్ల నిర్వహణను కేంద్రప్రభుత్వం సరళతరం చేసింది. పూర్తిచేయాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి 5కు, వసూలు చేసే 72 రకాల ఫీజులను 4కు తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది.