శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో టాప్ లష్కరే తోయిబా కమాండర్ మొహమ్మద్ యూసుఫ్ కంత్రూ హతమయ్యాడు. దాదాపు 22 ఏండ్ల నుంచి అతను లష్కరే బృందంలో యాక్టివ్గా ఉన్నాడు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని తంగ్మార్గ్ సబ్ జిల్లాలోని మాల్వా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. యూసుఫ్ కంత్రూ గతంలో అనేక మంది పౌరుల్ని, భద్రతా దళాల్ని చంపేశాడు. ఇటీవల బుద్గామ్ జిల్లాలో ఓ పోలీసు, అతని సోదరుడిని హతమార్చిన కేసులో యూసుఫ్ నిందితుడు. కంత్రూను హతమార్చడం ఓ గొప్ప సక్సెస్ అని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.