శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గాం జిల్లాలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నిషేధిత ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్కు చెందిన కమాండర్తో సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాంబేలో ముగ్గురు, గోపాల్పోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గోపాల్పోరా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో బలగాలు.. ప్రతిగా కాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాదులు మరణించారు. ఇదిలా ఉండగా మరో ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన మిలిటెంట్ కమాండర్ అఫాక్ సికందర్ను కుల్గామ్లో భద్రతా బలగాలు హతమార్చాయి.
ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ టెర్రరిస్ట్ కమాండర్ అఫాక్ సికిందర్ హతమయ్యాడని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోమవారం శ్రీనగర్లోని హైదర్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.