రవితేజ..క్రాక్ చిత్రంతో చాలా రోజుల తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఖిలాడీ సినిమా సెట్స్పై ఉండగానే త్రినాథరావు నక్కినతో కలిసి 68వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రానికి రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తాజా టాక్ ప్రకారం రవితేజ ఈ మూవీకి రూ.16 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట.
క్రాక్ చిత్రానికి రెమ్యునరేషన్ తోపాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన లాభాల్లో షేర్స్ కూడా తీసుకున్నాడు మాస్ మహారాజా. ఈ సారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజ డిమాండ్కు అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు టాక్. మారుతి-యూవీ క్రియేషన్స్ కాంబోలో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి మొదట రవితేజను అనుకోగా..రెమ్యునరేషన్ విషయంలో తగ్గించుకునేది లేదని రవితేజ చెప్పాడట. దీంతో గోపీచంద్ హీరోగా ఆ ప్రాజెక్టును మారుతి చేస్తున్నాడని టాక్.