కన్నడ హీరో సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విక్రాంత్ రోణ’. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్పై శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మించారు. త్రీడీ ఫార్మేట్లో దర్శకుడు అనూప్ భండారి రూపొందిస్తున్నారు. జూలై 28న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సుదీప్ నాకు పదేళ్లుగా తెలుసు. సినిమాల ఎంపిక విషయంలో కొత్తగా ఆలోచిస్తారు. ఈ సినిమాలో సృజనాత్మకత, గొప్ప సాంకేతిక విలువలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి సినిమా చేసి మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సుదీప్. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా మరో రికార్డ్ హిట్ కావాలి’ అన్నారు. సుదీప్ మాట్లాడుతూ…‘త్రీడీ ఫార్మేట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. టీమ్ అంతా అహర్నిశలు శ్రమించి సినిమా చేశారు. పాండమిక్ టైమ్లో అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేశాం. అప్పుడు నాగార్జున అందించిన సహకారం మర్చిపోలేము. ‘ఈగ’ చిత్రంతో నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళికి థాంక్స్. నా జర్నీకి దర్శకుడు రామ్గోపాల్ వర్మ కారణం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనూప్ భండారి, రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత షాలినీ మంజునాథ్, దర్శకుడు రామ్గోపాల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.