సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 25: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వివిధ పార్టీల నుంచి 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు అందజేశారు.
భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్షెట్కార్, భారతీయ జనతా పార్టీ నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి దేవ శిఖామణి టీడీఎస్ మణి తిట్ల, రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ నుంచి మొహమ్మద్ మున్వర్ హుస్సేన్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి బాల్రాజు బట్టెంకి, టీపీఎస్ అభ్యర్థిగా కొత్త బలిజ బస్వరాజ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మాలెపు మోహన్రెడ్డి,
ఇండియా ప్రజాబంధు తరఫున బాబు దుర్గయ్య రోమల, అలియన్స్ ఆఫ్ డెమక్రెటిక్ రీఫార్మ్స్ పార్టీ తరఫున మణి చావగాని, నేషనల్ మహాసభ పార్టీ నుంచి నక్క కృష్ణ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులు మారుతిరావు, మహాదేవ్ స్వామి, ప్రవీణ్, రామారావుపాటిల్, గంగారాం, రమేశ్ సజ్జాపూర్, తలారి అశోక్, జైపాల్ నాయక్ జడావత్, రమేశ్ సజ్జాపూర్, ఎండీ యాకుబ్ షరీఫ్, గొల్లపల్లి మాణయ్య, మొహమ్మద్ సద్దాం, చంటి రామకృష్ణదాస్, కిరణ్ రాథోడ్, సారిక మక్కైలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 26న నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.