సుల్తాన్బజార్: స్థానిక ఎల్బీ స్టేడియం వేదికగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా క్రికెట్ టోర్నీలో యూత్ఫోర్స్, డీఈవో యూనిట్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించాయి. తొలుత నిర్ణీత 12 ఓవర్లలో డెంటల్ కాలేజీ 79 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన యూత్ఫోర్స్ టీమ్ వికెట్ నష్టపోకుండా ఆరు ఓవర్లలో 80 పరుగులు చేసింది. మరో సెమీస్లో డీఈవో యూనిట్ టీమ్ 12 ఓవర్లలో 89 పరుగులు చేయగా, గాంధీ మెడికల్ కాలేజీ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకే పరిమితమైంది. గురువారం జరిగిన మ్యాచ్ల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, కలెక్టర్ శర్మన్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.