లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశించనున్నది. దీనిలో భాగంగా యూపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్పతి త్రిపాఠి, ఆయన కుమారుడు లలితేశ్పతి త్రిపాఠిని ఆహ్వానించింది. వారిద్దరూ సోమవారం తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. యూపీ మాజీ సీఎం కమలాపతి త్రిపాఠి మనుమడే రాజేశ్పతి. త్రిపాఠి కుటుంబానికి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ముఖ్యంగా పూర్వాంచల్ ప్రాంతంలో పట్టు ఉంది. గాంధీల కుటుంబానికి సన్నిహితులుగా పేరున్న త్రిపాఠి కుటుంబం గత నెలలో కాంగ్రెస్ను వీడింది. త్వరలో మమత వారణాసిలో సభ నిర్వహించనున్నట్లు సమాచారం.