కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ను తొలగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది రామప్రసాద్ సర్కార్ ఈ పిల్ దాఖలు చేశారు. గవర్నర్ బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, తృణమూల్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రివర్గంతో సంబంధం లేకుండా అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.