ఆదిలాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివ రాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో పేషెం ట్ కేర్ యూనిట్కు సంబంధించిన విభాగంలో 24 మంది సిబ్బంది నియామకాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టారు. ఈ కాంట్రాక్ట్ దుర్గం ఎస్సీ లేబర్ సొసైటీకి దక్కింది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జారీ చేయాల్సి ఉంటుంది. పత్రం జారీ కోసం ఎంప్లాయిమెంట్ అధికారి కిరణ్కుమార్ రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. దుర్గం ఎస్సీ లేబర్ సొసైటీ నిర్వాహకుడు దుర్గం శేఖర్ రూ.2.25 లక్షలతో అధికారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా జిల్లా ఎంప్లాయి మెంట్ అధికారి కిరణ్కుమార్, జూనియర్ ఎం ప్లాయిమెంట్ అధికారి విజయ లక్ష్మి, రిమ్స్ జూని యర్ అసిస్టెంట్ తేజను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, జాన్రెడ్డి, రవీందర్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.