న్యూఢిల్లీ : ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ పోలీసులు తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 14న తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు సమన్లు అందచేశారు.
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) జాక్వెలిన్కు సమన్లు జారీ చేయడం ఇది మూడవ సారి. గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేయగా బాలీవుడ్ నటి వాటిని విస్మరించింది. తన బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఆయా సమన్లకు స్పందించలేదని ఆమె చెప్పుకొచ్చారు.
సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి నడిపించిన దోపిడీ దందా వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో నటి నోరా పతేహిని ఈఓడబ్ల్యూ ఇటీవల ఆరు గంటల పాటు ప్రశ్నించింది.