Karsanbhai patel | సైకిల్పై ఇంటింటికీ తిరిగి వాషింగ్ పౌడర్ అమ్మిన వ్యక్తి ఇవాళ రూ.23 వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి అధిపతి. గ్రామీణులు, మధ్య తరగతి కస్టమర్లే లక్ష్యంగా ఆయన రూపొందించిన టీవీ ప్రకటనలు, మార్కెటింగ్ వ్యూహాలు వందలాది మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచాయి. అయిదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం నేటికీ స్ఫూర్తిదాయకం. ఆయనే నిర్మా లిమిటెడ్ అధినేత కర్సన్భాయ్ పటేల్. తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులను అమ్ముతూ కొన్ని దశాబ్దాల క్రితమే కార్పొరేట్ కంపెనీల పోటీని తట్టుకొని మార్కెట్లో రారాజుగా నిలబడ్డారాయన. అయితే ఈ ప్రయాణం ఆయన ఒక్కడితోనే ప్రారంభమైంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన వ్యాపారంలో రాణించాలని కల గన్నప్పుడు తోడుగా ఎవ్వరూ లేరు. కానీ తన కల నెరవేర్చుకోవాలన్న తపనకు తనకున్న రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్నే నమ్ముకున్నారు.
ఇంటి వెనుక భాగంలో సాధారణ రసాయనాలతో తక్కువ ధరకు నాణ్యమైన వాషింగ్ పౌడర్ తయారుచేసి వినియోగదారుల ఆదరాభిమానాలు పొందగలిగారు. ఆ వ్యాపార ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రభుత్వ కెమికల్ టెక్నీషియన్ ఉద్యోగానికి రాజీమానా చేసి రూ.15 వేల పెట్టుబడితో 1969లో చిన్న షెడ్డులో ఆయన నిర్మా వాషింగ్ పౌడర్ తయారీ ప్రారంభించారు. కర్సన్ భాయ్ అంకిత భావం, నిరంతర కృషి నిర్మాను భారతీయులకు మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు 18 వేల మంది ఉద్యోగులున్న నిర్మా కంపెనీ టర్నోవర్ రూ.7 వేల కోట్లు. ప్రస్తుతం నిర్మా గ్రూప్ సబ్బులు, కాస్మోటిక్స్తో పాటు ఇతర పర్సనల్ కేర్ వస్తువులనూ ఉత్పత్తి చేస్తున్నది. వ్యాపార రంగంలో ఆయన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
– నేషనల్ డెస్క్